AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తీర రక్షణకు “ఐఎన్‌ఎస్ వింధ్యగిరి”

భారత నౌకాదళంలో సేవలందించనున్న సరికొత్త యుద్ధనౌక “ఐఎన్‌ఎస్ వింధ్యగిరి” ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించారు. పశ్చిమబెంగాల్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కోల్‌కతా లోని హుగ్లీ నది ఒడ్డునున్న గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అధునాతన స్టెల్త్ యుద్ధ నౌకను నౌకాదళం లోకి ప్రవేశ పెట్టారు.

వింధ్యగిరి కర్ణాటక రాష్ట్రం లోని ఓ పర్వత శ్రేణి పేరు. ప్రాజెక్ట్ 17 ఏ లో భాగంగా రూపొందించిన ఆరో యుద్ధ నౌక ఇది. ఇదే పేరుతో గతంలో ఉన్న యుద్ధ నౌక 31 ఏళ్ల పాటు సేవలందించింది. 2012 దాకా అది పలు క్లిష్టతరమైన ఆపరేషన్లలో పాల్గొని సత్తా చాటింది. ఈ ఐఎన్‌ఎస్ వింధ్యగిరిలో సరికొత్త గ్యాడ్జెట్‌లను అమర్చనున్నారు. దీనిని నౌకాదళానికి అప్పగించే ముందు విస్తృత స్థాయిలో వివిధ రకాలుగా పరీక్షించి చూస్తామని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా పీ17ఏ నౌకలన్నీ గైడెడ్ మిస్సైల్ సామర్థం కలిగి ఉన్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10