పెరిగిన క్రైమ్ రేట్
ఈ ఏడాది 2,34,158 కేసులు నమోదు
అదుపులోనే శాంతిభద్రతలు
తెలంగాణ రాష్ట్రంలో 2024 సంవత్సరానికి సంబంధించిన వార్షిక క్రై మ్ నివేదికను డీజీపీ జితేందర్ విడుదల చేశారు. ఈ నివేదికలో తెలంగాణలో క్రై మ్ రేటు, లా – ఆర్డర్, సైబర్ క్రై మ్, డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి వివిధ అంశాలను వెల్లడించారు. దీని ప్రకారం 2024లో తెలంగాణలో క్రై మ్ రేటు గణనీయంగా పెరిగింది. 2023తో పోలిస్తే, ఈ ఏడాది 9.87 శాతం పెరిగి 2,34,158 కేసులు నమోదు అయ్యాయి. కానీ, శాంతి భద్రతల అంశం మరింత మెరుగుపడినట్లు డీజీపీ తెలిపారు. ఒకటి రెండు మినహా అన్ని ప్రాంతాలలో శాంతి భద్రతలు నియంత్రణలో ఉన్నాయని పేర్కొన్నారు.
నక్సల్స్, డ్రగ్స్..
ఈ ఏడాది తెలంగాణ పోలీసులు 85 మంది నక్సల్స్ను అరెస్టు చేయగా, 41 మందిని సరెండర్ చేయించారు. అలాగే, డ్రగ్స్ పై తీవ్ర చర్యలు తీసుకోవడం కొనసాగించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,942 డ్రగ్స్ కేసులు నమోదు చేసి, 4,682 మందిని అరెస్టు చేశారు. రూ. 142.95 కోట్ల విలువైన డ్రగ్స్ను పోలీసులు పట్టుకున్నారు.
సైబర్ క్రై మ్ పెరుగుదల
సైబర్ క్రై మ్లో కూడా తెలంగాణలో ఈ ఏడాది 43.33 శాతం పెరుగుదల కనిపించింది. 25,184 సైబర్ క్రై మ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రై మ్లలో రూ. 180 కోట్లు వదిలిన ఫండ్స్ రీఫండ్ అయిపోతే, రూ. 247 కోట్లు విలువైన ఆస్తులను పోలీసులు ఫ్రీజ్ చేశారు.
కొత్త చట్టాల అమలులో చర్యలు:
2024లో కొత్త చట్టాల అమలు ప్రారంభమైంది. ఈ కొత్త చట్టాల కింద 85,190 కేసులు నమోదు అయ్యాయి. ‘జీరో ఊఐఖ‘ వ్యవస్థను అమలు చేయడంతో, 1,313 కేసులు న్యాయ విధానం ద్వారా నమోదు చేయబడ్డాయి.
పోలీసుల భర్తీ, డయల్ 100 సేవలు:
ఈ ఏడాది 547 ఐలను, 12,338 కానిస్టేబుళ్లను నియమించారు. డయల్ 100 సేవకు నమ్మకంగా స్పందించిన ప్రజలు 16,92,173 కాల్స్ చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో పోలీసుల ఆత్మహత్యలు సహా పలు అంశాలపై డీజీపీ స్పందించారు.
ఆత్మహత్యల కారణాలు:
ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు, ఫ్యామిలీ సమస్యలు అనేవి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్రతి సంవత్సరమూ ఏదో ఒక కారణం వల్ల ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వర్క్ ప్రెజర్స్ (పని ఒత్తిడిని) కారణంగా కూడా కొన్ని సందర్భాలలో ఆత్మహత్యలు జరిగాయని ఆయన అన్నారు.
పోలీసుల చర్యలు:
ఆత్మహత్యలకు గురయ్యే వారికి ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిర్వహించడం, కౌన్సెలింగ్ ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.
అల్లు అర్జున్ కేసు: ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది, దీనిపై సమగ్ర విచారణ జరుగుతున్నట్లు చెప్పారు.
ఫోన్ టైపింగ్ కేసు: ఈ కేసులో కూడా విచారణ కొనసాగుతోంది. ఇందులో సీబీఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కి లేఖ రాశారు.
ప్రభాకర్ రావు కేసు: అమెరికా నుంచి ప్రాధమిక ప్రక్రియ ద్వారా భారత్కు రప్పించేందుకు ఇంటర్నేషనల్ ప్రాసెస్ జరుగుతోంది. ఇంటర్పోల్ సహాయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఈ ఏడాది తెలంగాణలో క్రై మ్ రేటు పెరిగినప్పటికీ, శాంతి భద్రతలు, సైబర్ క్రై మ్, డ్రగ్స్ పై అధికారుల చర్యలు విశేషమైనవిగా ఉన్నాయి. ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్న పోలీసులు, నూతన చట్టాల ద్వారా న్యాయ వ్యవస్థను మరింత సమర్థంగా చేశారని డీజీపీ ఈ సందర్భంగా తెలిపారు. 2024లో శాంతి, భద్రతల ప్రాముఖ్యత మరింత పెరిగినట్లుగా ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది.