AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

12న సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తోంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయనున్నారు.ఈ నెల (ఏప్రిల్) 12న ఎల్‌బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 12న సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు అధికారికంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన కార్యదర్శి భూపాల్‌రెడ్డిని ఆదేశించారు. ఈ ఇఫ్తార్ విందును రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిర్వహించనుంది. ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం మతపెద్దలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, సామాన్య ప్రజలు పాల్గోనున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ప్రధాని మోదీ … శనివారం హైదరాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.అయితే ప్రధాని మోదీ ప్రసంగంపై బీఆర్‌ఎస్‌ నాయకులు, మంత్రులు మండిపడ్డారు. కుటుంబ పాలన, అవినీతి అంటూ ప్రధాని తెలంగాణ సర్కార్‌ను ఉద్దేశించి చేసిన విమర్శలపై ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10