AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భారత్‌కు వస్తున్న పుతిన్… పర్యటన తేదీలు ఖరారు..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఆయన డిసెంబర్ 4, 5 తేదీల్లో భారతదేశంలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ భారత్‌కు వస్తున్నారని, ఈ పర్యటన తేదీలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. రష్యా వార్తా సంస్థ క్రెమ్లిన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.

 

ఈ పర్యటనలో భాగంగా పుతిన్ ఢిల్లీలో ప్రధాని మోదీతో కీలక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం సహా పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సదస్సు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

 

పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రష్యా అధ్యక్షుడు పుతిన్ గౌరవార్థం ప్రత్యేక విందును ఏర్పాటు చేయనున్నారు. ఈ విందుకు ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారు. ఈ శిఖరాగ్ర సమావేశం ద్వారా ఇరు దేశాల మధ్య సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం లభిస్తుందని, ఇది ఉభయ దేశాల పురోగతికి ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు

ANN TOP 10