AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మెట్రో సేవల సమయం పొడిగింపు

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈరోజు రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్-పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మెట్రో రైలు సేవల సమయాన్ని పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాత్రి 12.30 గంటలకు చివరి రైలు నడవనుందని పేర్కొన్నారు. అయితే ఉప్పల్ స్టేడియం స్టేషన్ నుంచి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రాత్రి 12.30 గంటల తర్వాత మిగతా స్టేషన్లలో ప్రయాణికులు బయటకు వచ్చేందుకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. అయితే మ్యాచ్ కు రెండు గంటల ముందు నుంచి ఉప్పల్ కు ఎక్కువ సర్వీసులు తిరుగుతాయని వెల్లడించారు.

ANN TOP 10