హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈరోజు రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్-పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మెట్రో రైలు సేవల సమయాన్ని పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాత్రి 12.30 గంటలకు చివరి రైలు నడవనుందని పేర్కొన్నారు. అయితే ఉప్పల్ స్టేడియం స్టేషన్ నుంచి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రాత్రి 12.30 గంటల తర్వాత మిగతా స్టేషన్లలో ప్రయాణికులు బయటకు వచ్చేందుకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. అయితే మ్యాచ్ కు రెండు గంటల ముందు నుంచి ఉప్పల్ కు ఎక్కువ సర్వీసులు తిరుగుతాయని వెల్లడించారు.
