AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆది సాయికుమార్ ‘శంబాల’ క్రిస్మస్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సూపర్ నేచరల్ థ్రిల్లర్ చిత్రం ‘శంబాల’ విడుదల తేదీ ఖరారైంది. ఈ మూవీని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విశ్వక్ సేన్ నటించిన లవ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఫంకీ’ మరియు యంగ్ హీరో రోషన్ మేక పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’ కూడా క్రిస్మస్ బరిలో ఉన్నట్లు ప్రకటించగా, ఇప్పుడు ‘శంబాల’ చేరికతో క్రిస్మస్‌కు మూడు పెద్ద సినిమాలు పోటీ పడనున్నాయి.

యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ‘శంబాల’ టీజర్ మరియు లుక్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం ఒక సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అంతరిక్షం నుంచి అతీంద్రియ శక్తులున్న ఒక రాయి ఓ గ్రామంలో పడగా, ఆ తర్వాత జరిగే పరిణామాలు, ప్రజలు చనిపోవడం, సైన్స్‌కు అందని రహస్యాలను మూఢ నమ్మకాలకు ముడిపెడుతూ ఈ పవర్ ఫుల్ నేచరల్ హారర్ థ్రిల్లర్‌ను తెరకెక్కించినట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది.

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నమోజు, మహీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది సాయికుమార్ సరసన అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుండగా… రవివర్మ, స్వాసిక, మధునందన్, శివకార్తీక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. “అతని క్రిస్మస్. ఇది కేవలం వెలుగు కాదు అది ఓ శక్తి. డిసెంబర్ 25న అగ్ని, ఉగ్రత, విధిని కలిపిస్తుంది” అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ANN TOP 10