ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) హైదరాబాద్ పర్యటన (PM Modi Hyd Tour) నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (BRS KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు బేగంపేట్ ఎయిర్పోర్టుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, హైదరాబాద్లో (Hyderabad) రూ.11,360 కోట్ల రూపాయలతో జరగనున్న పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉంటున్నట్లు తాజా సమాచారం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వందే భారత్ రైలును మోదీ ప్రారంభించనున్నారు. ఇది అధికారిక కార్యక్రమం. దాంతో, సీఎం కేసీఆర్కు పీఎంవో నుంచి ఆహ్వానం అందింది కూడా. ఏడు నిమిషాల పాటు కేసీఆర్కు మాట్లాడే సమయం కూడా ఇచ్చారు. అధికారిక కార్యక్రమం అయినా సీఎం కేసీఆర్ వెళ్లడం లేదని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఆయన బదులు ఎప్పట్లాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు.
