పినపాక నియోజకవర్గంలో రూ.125 కోట్ల వ్యయంతో అంతర్గత రోడ్లు, లింకు రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, కాలువలు వంటి మౌలిక సదుపాయాల పనులు ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేస్తామని ఆయన అన్నారు. అభివృద్ధి పనుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామని హామీ ఇచ్చారు.
