AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వెంకీ, త్రివిక్ర‌మ్ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం..!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో వెంక‌టేశ్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని వెంకీ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌క‌టించారు. స్వాతంత్ర్య దినోత్స‌వం కానుక‌గా.. ఈ ప్రాజెక్ట్ ఇవాళ పూజా కార్య‌క్రామాలు జరుపుకుంది. ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించనున్నారు. ఇది వెంక‌టేశ్‌కు 77వ సినిమా. త్వ‌ర‌లోనే షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌బోతున్నార‌ని స‌మాచారం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

 

కాగా, వెంకీ నటించిన ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి సూప‌ర్ హిట్ చిత్రాలకు త్రివిక్రమ్‌ మాటల ర‌చ‌యిత‌గా ప‌ని చేశారు. ఇప్పుడు ఈ కాంబోలో మూవీ ఖాయం కావ‌డంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే ఈ ఏడాది సంక్రాంతికి వ‌చ్చిన‌ ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ మూవీతో వెంకటేశ్ భారీ హిట్ కొట్టిన విష‌యం తెలిసిందే. దీంతో వెంకీ మామ త‌దుప‌రి సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఆత్రుత‌గా ఎదురుచూశారు. ఇప్పుడు త్రివిక్ర‌మ్‌తో మూవీ చేస్తుండ‌డంతో వారి ఆనందానికి అవ‌ధుల్లేవ్‌. ఈ కాంబో త‌ప్ప‌నిస‌రిగా సూప‌ర్ హిట్ కొడుతుంద‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ANN TOP 10