తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో ‘బిగ్బాస్’ మళ్లీ వచ్చేస్తోంది. వరుసగా ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు 9వ సీజన్తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ సీజన్కు ‘డబుల్ హౌస్.. డబుల్ డోస్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్లైన్ను ఖరారు చేశారు. ఈసారి షో ఫార్మాట్ను పూర్తిగా మార్చేసినట్లు తెలుస్తుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఈసారి షో ఎంత భిన్నంగా ఉండబోతోందో నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ ప్రోమోలో నాగార్జున, ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిశోర్తో మాట్లాడుతూ.. ‘ఎప్పుడైనా పాత సిలబస్తో కొత్త ఎగ్జామ్ రాస్తావా?’ అని ప్రశ్నించడం ద్వారా కొత్తదనాన్ని నొక్కిచెప్పారు.
ఈ సీజన్లో ‘డబుల్ హౌస్’ అనే వినూత్నమైన కాన్సెప్ట్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు, కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాకుండా సామాన్యులకు కూడా ఈ షోలో అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. ఈ మార్పులతో షో మరింత ఉత్కంఠభరితంగా సాగనుందని, ప్రేక్షకులకు రెట్టింపు వినోదం గ్యారెంటీ అని బిగ్బాస్ బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. త్వరలోనే ఈ షో ప్రసార తేదీని అధికారికంగా ప్రకటించనున్నా
రు.