AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జైలు నుంచి బండి సంజయ్ విడుదల..

కార్యకర్తల సంబురాలు
టెన్త్ పేపర్ వాట్సప్‌లో వైరల్ చేసిన కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. శుక్రవారం ఉదయం జైలు నుంచి బయటకు విడుదలయ్యారు. కరీంనగర్ జైలు నుంచి ఆయన బెయిల్‌పై బయటకొచ్చారు. జైలు అధికారులకు బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ కుమార్ బెయిల్ పేపర్లు సబ్మిట్ చేశారు. అనంతరం జైలు అధికారులు పేపర్లను పరిశీలించి బండి సంజయ్‌ను జైలు నుంచి విడుదల చేశారు. బండి జైలు నుంచి బయటకు రావడంతో బీజేపీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.

జైలు నుంచి విడుదల అయిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీ విషయంలో మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన అభ్యర్థులకు లక్ష రూపాయలు ఇవ్వాలని కోరారు. ‘హిందీ పేపర్ ఎవరైనా లీక్ చేస్తారా..? అంతకుముందు రోజు తెలుగు పేపర్ ఎవరు రిలీజ్ చేసిన్రు మరి..? 30 లక్షల నిరుద్యోగుల కుటుంబీకులు ముఖ్యమంత్రి కొడుకును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే టాపిక్ డైవర్ట్ చేయడానికే నాపై ఈ కుట్రపూరితమైన ఆరోపణలు చేశారు. సిట్టింగ్ జడ్జితో టెన్త్ పేపర్ లీకేజీతో పాటు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌పై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నా’ అని పేర్కొన్నారు.

‘మాల్ ప్రాక్టీస్ అంటే ఏంటో కూడా వరంగల్ సీపీకి తెలియదు. మా అత్త చనిపోయిన సమయంలో ఇదా పరిస్థితి..? నన్ను కన్నకొడుకులా చూసింది.. నేను లేకపోతే పక్షి ముట్టలేదు.. ఇంట్లో అంతా విషాదంలో ఉన్నారు.. ఓ పార్లమెంటేరియన్ తో వ్యవహరించే శైలి ఇదా..? నాపైన పీడీ యాక్ట్ పెట్టాలని ఓ అగ్గిపెట్టె మంత్రి మాట్లాడుతుండు. కేసీఆర్ కొడుకును సీఎంగా ప్రకటిస్తే మొట్టమొదట గోడదూకే మంత్రి అగ్గిపెట్టె హరీష్ రావే.. రాజ్ దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యలపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నా. నీ కూతురుపై విచారణ నడుస్తోంది.. నెక్స్ట్ నీ కొడుకుపై విచారణకు సిద్ధమవుతోంది. నీవిచ్చిన హామీలపై ప్రశ్నిస్తే మేం పిచ్ఛోళ్లమా..? లవంగానికీ, తంబాకుకు తేడా తెలియని చదువుకున్న అజ్ఞాని కేటీఆర్’ అని బండి సంజయ్ విమర్శించారు’

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10