AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్రపతి భవన్‌లో మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్..!

మంచు విష్ణు నటించిన భక్తిరస చిత్రం ‘కన్నప్ప’ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమాను వీక్షించిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు విష్ణు నటనను ప్రశంసించారు. ఈ ప్రత్యేక ప్రదర్శన పట్ల చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఒక ప్రకటన విడుదల చేసింది. భక్తి కథాంశం, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ఈ చిత్రానికి లభించిన గుర్తింపు తమకు గర్వకారణమని వారు పేర్కొన్నారు.

 

శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జూన్ 27న విడుదలైంది. ముకేశ్ కుమార్ సింగ్ దీనికి దర్శకత్వం వహించారు. విష్ణు నటన, ఎమోషన్స్, క్లైమాక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో రుద్రగా ప్రభాస్, శివపార్వతులుగా అక్షయ్ కుమార్ – కాజల్, కిరాతుడిగా మోహన్ లాల్ తమ నటనతో అలరించారు.

ANN TOP 10