AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పవన్ ఓజీ షూటింగ్ పూర్తి..! రిలీజ్ ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. పవన్ కల్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా పవన్ కల్యాణ్ సరికొత్త, పవర్ ఫుల్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ అభిమానులలో జోష్ మరింత పెరిగింది.

దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ముంబై నేపథ్యంలో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ కథలో పవన్ కల్యాణ్ ఒక శక్తివంతమైన, ఇంటెన్స్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన పోస్టర్‌లో పవన్ కల్యాణ్ మాస్ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. 

“అన్ని షూటింగ్‌లు అయిపోయాయి.. ఇప్పుడు థియేటర్ల వంతు.. ఓజీ ఆశ్చర్యపరచబోతోంది.” అంటూ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఈ కీలక అప్‌డేట్‌ను అందించారు. ఇది సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.

ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు, ఇది సినిమాకు మరింత ఆకర్షణను జోడిస్తోంది. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


‘ఓజీ’ చిత్రాన్ని 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇటీవల రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన సినిమా షూటింగ్‌లను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ఇతర ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.
Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10