హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లి అక్కడ హత్యకు గురైన ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మేఘాలయలో సోనమ్, రాజా కలిసి రికార్డు చేసుకున్న చివరి వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో భార్య సోనమ్ ధరించి కనిపించిన షర్ట్.. రాజా మృతదేహం లభ్యమైన ప్రదేశంలో కనుగొన్నారు. హత్య జరగడానికి ముందు వారీ వీడియోను తీసుకున్నట్టు తెలిసింది. ఈ పరిణామం కేసు దర్యాప్తులో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
ఈ వీడియోలో సోనమ్ ఒక షర్ట్ ధరించి కనిపించింది. అదే షర్ట్ను పోలీసులు ఆమె భర్త మృతదేహం లభ్యమైన ప్రదేశంలో కనుగొన్నారు. దీంతో ఈ షర్ట్ కేసులో కీలక ఆధారంగా మారే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఆ షర్ట్ అక్కడికి ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ ఏం జరిగిందనేది అంతుచిక్కకుండా ఉంది.
ప్రస్తుతం పోలీసులు ఈ వీడియో ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సోనమ్ను కూడా విచారించి మరిన్ని వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ చివరి వీడియో, ఘటనా స్థలంలో లభించిన షర్ట్ ఆధారంగా రాజా మృతికి గల కారణాలను ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు.