ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ విచారణతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుండెల్లో గుబులు మొదలైందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సిట్ విచారణలో అవినీతి బాగోతాలు బయటకు వస్తాయనే కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు.
జగన్ ప్రభుత్వ హయాంలో ప్రపంచం విస్తుపోయేలా మద్యం కుంభకోణం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా గాలిజనార్ధన్రెడ్డి వ్యవహారాన్ని మంత్రి రవీంద్ర గుర్తు చేశారు. ఆనాడు గాలిజనార్ధన్ రెడ్డి అవినీతిపై చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తే.. వైఎస్ఆర్ సహా చాలా మంది నిందారోపణలు చేశారని తెలిపారు.
కానీ, నేడు గాలిజనార్ధన్రెడ్డిని న్యాయస్థానం దోషిగా తేల్చి శిక్ష విధించిందన్నారు. లిక్కర్ స్కామ్లోనూ దోపిడీదారులు తప్పించుకోవడం అసాధ్యమని మంత్రి చెప్పారు. మద్యం కుంభకోణానికి సంబంధించి త్వరలోనే అన్నీ నిజాలు బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు.