చంద్రయాన్-5 ప్రయోగానికి భారత్ అడుగులు పడుతున్నాయి. చంద్రయాన్ 5 కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ ప్రకటించారు. చంద్రయాన్ 3లో 25 కిలోల ప్రజ్ఞాన్ రోవర్ను చంద్రునిపై దించారు ఇస్రో శాస్త్రవేత్తలు. చంద్రయాన్ 5లో 250 కిలోల రోవర్ను చంద్రునిపై దించేందుకు ప్రణాళిక రెడీ చేస్తోంది. జపాన్ సహకారంతో మిషన్ చంద్రయాన్ 5 చేపట్టనున్నారు. చంద్రాయాన్ 5 విజయం అయిన తర్వాత చంద్రయాన్ 4 మిషన్ చేపట్టనున్నారు.
ఈ మిషన్ కోసం జపాన్ అంతరిక్ష సంస్థ JAXAతో మూడో సారి భేటీ అయినట్టు ఇస్రో ప్రకటించంది. చంద్రయాన్-5 భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఓ మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. భారతీయ వ్యోమగాములు చంద్రునిపైకి కాలుమోపడమే లక్ష్యంగా చంద్రయాన్-5 ప్రయోగం ఉండనుంది. ఈ నెల 13, 14న బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి JAXA ప్రతినిధుల బృందం వచ్చింది. చంద్రయాన్-5 గురించి కీలక చర్చలు జరిగాయి.
చంద్రుని కక్ష్యలో చంద్రయాన్-1, 2 ప్రయోగాలు జరిగాయి. ల్యాండర్-రోవర్ను చంద్రునిపై దించి చంద్రయాన్-3 ప్రయోగం చేశారు. చంద్రుని దక్షిణ ధ్రువంలో శాశ్వతంగా నీడ ఉన్న ప్రాంతంలో నీటిపై ప్రయోగాలు జరగనున్నాయి. దీని కోసం చంద్రయాన్ 5 ను ప్రయోగిస్తారు.
మరో కీలక మైలు రాయిని దాటడానికి ఇస్రో సిద్ధమవుతుంది. కొద్ది రోజుల క్రితం చంద్రయాన్-5 కేంద్రం ఆమోదం తెలిపింది. జపాన్ సహాకారంతో చంద్రయాన్-5 ని చెప్పాట్టబోతున్నారని తెలిపారు. చంద్రయాన్-3లో 25 కేజీల ప్రజ్ఞాన్ రోవర్ని చంద్రుని పైకి పంపించారు. ఈ సారి ఏకంగా 250 కేజీల రోవర్ని పంపడానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి చంద్రుని పైనా ఉన్న ఉపిరితలాన్ని అధ్యయానం చేయాడానికి ప్రయోగాలు ఇస్రో చేపడుతున్నారు.
అయితే మొదటిసారిగా 2008లో చంద్రయాన్-1.. అక్కడ ఉన్న కేమికల్స్, మినరల్స్, ఫోటోజియోలాజికల్ మ్యాపినింగ్ మొత్తం మొదటి చంద్రయాన్ ద్వారా తీసుకున్నారు. అలాగే చంద్రయాన్- 2 చివరి నిమిషంలో కొంత ఇబ్బంది పెట్టిన 98 శాతం విజయం సాధించింది. కేవలం 2 శాతం మాత్రమే సక్సేస్ కాలేకపోయింది. అయిన అక్కడ ఉన్న కేమారాతో అది ఇప్పటికి కూడా ప్రతిరోజూ వందలాది ఫోటోలు తీసి పంపిస్తుంది.
ఇంకా చంద్రయాన్-3 గురించి అందరికి తెలిసిన విషయమే.. 2023 ఆగస్టున విక్రమ్ అనే రోవర్ని అక్కడికి దించారు. దీన్ని విజయవంతం చేశారు. ఇప్పుడు జపాన్ సహాకారంతో చంద్రయాన్-5 అత్యంత ప్రతిష్టాత్మకంగా దించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.