ఏపీ ప్రభుత్వం అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అమరావతి పనుల రీ లాంఛ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ప్రధాని మోదీ అమరావతి పనులను ప్రారంభించారు. మూడేళ్ల కాలంలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అమరావతి కేంద్రంగా కొత్త సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం అమరావతికి మరో కీర్తి కిరీటం గా మారబోతోంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది.
కీలక ఒప్పందం
అమరావతి కేంద్రంగా క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు రంగం సిద్దం అవుతోంది. దేశంలోనే మొదటి అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కును అమరావతిలో నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కీలక ఒప్పం దాలు జరిగాయి. ఐబీఎం సంస్థ 156 క్యూబిక్ హెరాన్ ప్రాసెసర్తో క్వాంటమ్ సిస్టం-2ని ఏపీలో నెలకొల్పుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్టీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్టీతో జరిగిన ఒప్పందం దేశానికే చరిత్రాత్మకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
దేశంలోనే తొలిసారి
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ , క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాలను అందిపు చ్చుకోవడం ముఖ్యమని చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుందని చంద్రబాబు వివరించారు. అందుకే అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చి దిద్దాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని తీర్చిదిద్దాలని ఐబీఎం, టీసీఎస్ సంస్థలకు సూచించానని తెలిపారు. దేశంలో క్వాంటమ్ ప్రయా ణానికి ఐబీఎం క్వాంటమ్ సిస్టం-2 ఏర్పాటు కీలక మలుపు కానుందని సీఎం అభిప్రాయపడ్డారు. తక్కువ సమయంలోనే క్వాంటమ్ వ్యాలీని నిర్మించాలన్నారు.