AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎస్ శాంతి కుమారికి కీలక బాధ్యతలను అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం..

తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె. రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 

మరోవైపు, పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎస్ శాంతి కుమారికి ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) వైస్ ఛైర్మన్‌గా ఆమెను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ పదవి నుంచి వైదొలగిన తర్వాత ఆమె ఈ నూతన బాధ్యతలను చేపట్టనున్నారు. దీంతో పాటు, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

 

ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కె. రామకృష్ణారావు, 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. నూతన సీఎస్ ఎంపికపై గత కొంతకాలంగా ప్రభుత్వం కసరత్తు చేసింది. సీనియారిటీ జాబితా ప్రకారం పలువురు అధికారుల పేర్లను పరిశీలించిన అనంతరం, రామకృష్ణారావు సమర్థత, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10