AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్ రజతోత్సవ సభ… నేతలకు కీలక సూచనలు చేసిన కేసీఆర్..

ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాకు చెందిన పలువురు నేతలు, మహిళా నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు.

 

రజతోత్సవ సభలో మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు, సభను విజయవంతం చేయడంలో వారి భాగస్వామ్యం, కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ విప్ దాస్యం విజయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వొడితెల సతీశ్ కుమార్, జీవన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10