AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో పెరగనున్న మెట్రో రైలు ఛార్జీలు..

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోవడంతో ఛార్జీలను పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

 

ఇదివరకే బెంగళూరు మెట్రో ఛార్జీలను 44 శాతం మేర పెంచారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఛార్జీలను ఎంత పెంచాలనే అంశంపై ఎల్ అండ్ టీ కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే హాలీడే సేవర్ కార్డు, మెట్రో కార్డుపై లభించే 10 శాతం డిస్కౌంట్‌ను తొలగించింది.

 

మెట్రో రైలు ప్రాజెక్టు కారణంగా ఎల్ అండ్ టీ సంస్థ భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు రూ.6,500 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఛార్జీల పెంపుదల కోసం ఎల్ అండ్ టీ గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే, పలు కారణాల వల్ల ప్రభుత్వం ఆ ప్రతిపాదనకు అంగీకరించలేదు.

ANN TOP 10