AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎదురుకాల్పులు .. ఇద్దరు మావోయిస్టు అగ్రనేతల మృతి..

ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కొండగావ్ – నారాయణ్‌పూర్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. దీంతో మావోయిస్టులు అక్కడి నుంచి పరారయ్యారు.

 

ఆ తర్వాత అక్కడ భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టగా, రెండు మృతదేహాలు, ఏకే-47 తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో మృతి చెందిన వారిని మావోయిస్టు అగ్రనేతలుగా గుర్తించారు. అయితే వారి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. అక్కడ ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజ్ తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10