AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వెంటిలేటర్ తీసేసాం..శ్రీతేజ్ హెల్త్ అప్‌డేట్..

సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ హైదరాబాద్‌లో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన రాజకీయంగా ఇంకా చాలా రకాలుగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఇష్యూ అయింది. దీంతో  అతని ఆరోగ్యం మీద కిమ్స్ వైద్యులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. దానికి తోడు శ్రీతే ఆసుపత్రి ఖర్చులు అన్నీ అల్లు అర్జున్ భరిస్తున్నాడు. ప్రస్తుతం బాబు కోలుకోవడం అల్లు అర్జున్‌తో పాటూ మొత్తం మూవీ టీమ్‌కు ఎంతో అవసరం. అలాగే అతనిని పరామర్శించడానికి చాలామంది నేతలు, ప్రముఖులూ తరలివస్తున్నారు కూడా.

వెంటిలేటర్ లేకుండానే..

ఈ క్రమంలో శ్రీతేజ్ ఆరోగ్యం మీద   టెన్షన్ ఏర్పడింది. అందుకే కిమ్స్ వైద్యులు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్‌లను విడుదల చేస్తున్నారు.  శ్రీతేజ్ బాగానే కోలుకున్నాడని ఈరోజు డాక్టర్లు తెలిపారు. ఎటువంటి ఆక్సిజన్  కానీ వెంటిలేటరీ సపోర్ట్ లేకుండా ఊపిరి తీసుకుంటున్నాడని తెలిపారు.  అతను అప్పుడప్పుడు కళ్లు తెరుస్తున్నాడు కానీ.. ఐ కాంటాక్ట్ కానీ..కుటుంబ సభ్యులను గుర్తు పట్టడం లాంటివి కానీ చేయడం లేదని వెల్లడించారు. సైగలను గమనిస్తున్నాడు కానీ..మాటలను అర్థం చేసుకోలేకపోతున్నాడని తెలిపారు.  నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ వెల్ ద్వారా ఫుడ్ ను అందిస్తున్నామని చెప్పారు డాక్టర్లు.

ANN TOP 10