AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కనకదుర్గమ్మ సన్నిధిలో సీతక్క విజయవాడ దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

మొక్కులు చెల్లించుకున్న మంత్రి

విజయవాడ కనకదుర్గమ్మను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సీతక్క అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.  మంత్రి సీతక్కను వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదం చిత్రపటం అందజేశారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు న్యాయవాది గంగ శెట్టి అయ్యప్ప తదితరులు ఉన్నారు.

ANN TOP 10