AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు సీఎం రేవంత్‌ నివాళులు

భారత దేశ తొలి ఉపప్రధాని, ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. ఆదివారం వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌ నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు పుష్పాంజలి ఘటించారు. పటేల్‌ కు నివాళులు అర్పించిన వారిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డిలు ఉన్నారు. దేశ సమగ్రత, సమైక్యతకు సర్దార్‌ పటేల్‌ చేసిన కృషిని వారంతా స్మరించుకున్నారు.

ANN TOP 10