AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఒకే బొమ్మలో అనేక చిత్రాలు ..

ఒకే బొమ్మలో అనేక చిత్రాలు కనిపించేలా బొమ్మలు గీయడంలో ఆయనది అందెవేసిన చేయి.తెలంగాణ ప్రాంతంలో జరిగే బోనాల ఉత్సవం, శివసత్తులు, పోతరాజుల నృత్యాన్ని ఆయన బొమ్మల్లో చిత్రీకరించారు. ఇప్పటి వరకు అనేక మందితో ప్రశంసలు అందుతున్న ఈ ఫోటోలు ఇప్పుడు ఆదిలాబాద్‌లో ప్రదర్శనకు ఉన్నాయి. ఆయన మరెవరో కాదు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన చేయి తిరిగిన చిత్రకారుడు అన్నారపు నరేందర్.

ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ పి.ఎస్. రాహుల్ రాజ్ ప్రారంభించారు. ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన బొమ్మలను సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. ముఖ్యంగా విద్యార్థులు, ఛాత్రోపాధ్యాయులు, పట్టణానికి చెందిన కవులు, రచయితలు, కళాకారులు నరేందర్ చిత్రాలను ఆసక్తిగా తిలకించారు.

ANN TOP 10