AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కానిస్టేబుళ్ల దుర్మరణం

గజ్వేల్‌లో హిట్‌ అండ్‌ రన్‌ ఘటన

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని జాలిగామ బైపాస్‌ రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు మృతిచెందారు. మృతులు పరందాములు, వెంకటేశ్‌గా గుర్తించారు. వీరిలో పరందాములు రాయపోల్‌ పోలీస్‌స్టేషన్‌లో, వెంకటేశ్‌ దౌల్తాబాద్‌ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

అయితే వీరిద్దరు ఈసీఎల్‌లో జరుగుతున్న మారథాన్‌ రన్నింగ్‌లో పాల్గొనడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. కాగా, కానిస్టేబుళ్ల మృతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ANN TOP 10