AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాసేపట్లో గజ్వేల్‌కు సీఎం రేవంత్‌..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాసేపట్లో గజ్వేల్‌కు వెళ్తున్నారు. సిద్దిపేట జిల్లాలో హెచ్‌సీసీబీ ఏర్పాటు చేసిన కోకా కోలా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బివరేజెస్ సంస్థ సిద్ధిపేట్ జిల్లాలో భారీ ప్లాంట్ ఏర్పాటు చేసింది. బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్కులో నిర్మించిన భారీ బాట్లింగ్ యూనిట్‌ను సిఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు.

దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకుంది. ఈ ప్లాంట్ ద్వారా 400 మందికి ఉద్యోగాలు లభించ నున్నాయి. హెచ్‌సీసీబీకి 49 ఎకరాల భూమిని కేటాయించింది ప్రభుత్వం.

ANN TOP 10