పదో తరగతి పరీక్షల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్ పరీక్షలను రద్దు చేస్తూ గురువారం (నవంబర్ 28న) తీసుకున్న నిర్ణయాన్ని.. సర్కార్ ఉన్నట్టుండి వెనక్కి తీసుకుంది. ఇంటర్నల్ పరీక్షల రద్దు నిర్ణయాన్ని ఈ ఏడాదికి నిలిపేస్తూ.. వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పదో తరగతి విద్యార్థుల మార్కుల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ నిన్న (నవంబర్ 28న) కీలక నిర్ణయం తీసుకోగా.. ఈరోజు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. పదో తరగతిలో ఇప్పటివరకు ఉన్న గ్రేడ్ల విధానానికి స్వస్తి చెప్పాలని భావిస్తూ గురువారం రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. ఆ నిర్ణయాన్ని సర్కార్ శుక్రవారం (నవంబర్ 29న) రోజున వెనక్కి తీసుకుని అందరికీ ట్విస్ట్ ఇచ్చింది. పదోతరగతిలో ఇంటర్నల్ పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ఇంటర్నల్ మార్కులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని 2024-25 విద్యా సంవత్సరానికి నిలిపివేస్తూ.. వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.