పెట్టుబడులకు డెస్టినేషన్గా మారిన తెలంగాణలోని హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రముఖ కంపెనీలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో.. ఇప్పటికే పెద్ద పెద్ద సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టగా.. తాజాగా మరో ప్రముఖ సంస్థ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. దేశంలో పేరుగాంచిన.. అంబర్- రెసోజెట్ సంస్థ రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించుకుంది. రూ.250 కోట్లతో రాష్ట్రంలో కొత్త తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన ఈ సంస్థ.. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
అయితే.. అంబర్-రెసోజెట్ కంపెనీ.. ఎలక్ట్రానిక్ విడి భాగాల తయారీదారుగా దేశవ్యాప్తంగా ఎంతో పేరుపొందింది. ఏసీలు, వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్లు, పారిశ్రామిక ఎయిర్ కండీషనర్లు వంటి పరికరాలకు ఈ సంస్థ ప్రముఖ ప్రమోటర్గా ఉంది. హైదరాబాద్ను ఈ పరిశ్రమ కొత్త ప్రాజెక్ట్కు డెస్టినేషన్గా ఎంచుకోవడం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ ప్లాంట్ ఏర్పాటుతో వచ్చే మూడేళ్లలో రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.