AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జంపింగ్‌ జంపాగ్‌లకు బిగ్‌ రిలీఫ్‌.. బీఆర్‌ఎస్‌కు ఎదురు దెబ్బ

హైకోర్టు సంచలన తీర్పు
స్పీకర్‌దే తుది నిర్ణయమంటూ వెల్లడి

జంపింగ్‌ జంపాగ్‌లకు తెలంగాణ హైకోర్టులో బిగ్‌ రిలీఫ్‌ లభించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిల్‌ దాఖలైంది. కాంగ్రెస్‌లోకి వెళ్లిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిపై స్పీకర్‌ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ నేతలు పిటిషన్‌ వేశారు.

అసెంబ్లీ కార్యదర్శి రిట్‌ అప్పీల్‌పై..
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా టైం ఫ్రెమ్‌ ఫిక్స్‌ చేయాలని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం వినోద్‌ కుమార్‌కు సింగిల్‌ బెంచ్‌ ఆదేశించింది. సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్‌ చేశారు. అసెంబ్లీ కార్యదర్శి రిట్‌ అప్పీల్‌పై హై కోర్టు తీర్పు ప్రకటించింది. స్పీకర్‌ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్‌ బెంజ్‌ స్పష్టం చేసింది. స్పీకర్‌కు ఎలాంటి టైం బాండ్‌ లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. రీజనబుల్‌ టైంలో స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును హైకోర్టు కొట్టేవేసింది.

తీర్పులో కీలక అంశాలు..
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 10వ షెడ్యూల్‌ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు సీజే ధర్మాసనం సూచించింది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను సీజే ధర్మాసనం కొట్టివేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, 10వ షెడ్యూల్, అసెంబ్లీ ఐదేళ్ల గడువును దృష్టిలో ఉంచుకుని స్పీకర్‌ తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులను కొట్టివేసింది.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. బీఆర్‌ఎస్‌ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ గౌడ్, హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్‌ పై న్యాయస్థానం విచారించి పై విధంగా తీర్పు చెప్పింది.

ANN TOP 10