వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడి ఘటన తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ నేతల హస్తం ఈ దాడి వెనుక ఉందనే ఆరోపణలు వినిపిస్తుండగా.. తమపై కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడిలో పాల్గొన్న నిందితుల్లో ఒకరు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్రెడ్డితో ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో నరేందర్ రెడ్డి ఉన్నారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్పై ఇవాళ(మంగళవారం) తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. రీమాండ్ను కొట్టివేయాలని నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.