AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కులగణనపై పొన్నం కీలక భరోసా.. అవి రహస్యంగానే ఉంచుతామంటూ..

 తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక భరోసా ఇచ్చారు. సర్వే వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదని చెప్పారు. సర్వేలో వెల్లడించిన వివరాలు మొత్తం గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ మేరకు ఆదివారం హుస్నాబాద్ లో సర్వేను పరిశీలించిన పొన్నం… రాష్ట్ర వ్యాప్తంగా 87 వేల మంది ఎన్యుమరేటర్లతో సర్వే కొనసాగుతోందని చెప్పారు.

జనాభా తెలుసుకునేందుకే..

ఈ మేరకు పొన్నం మాట్లాడుతూ.. అన్ని రకాల అసమానతలను తొలగించి, కులాల జనాభా తెలుసుకునేందుకు సర్వే చేస్తున్నాని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6వ తేదీ నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. దీనిపై ఈనెల 30 వరకు కార్యక్రమం నిర్వహిస్తోంది. ఒక్కో ఎన్యూమరేటర్ 150 నుంచి 175 ఇళ్ల దాకా కేటాయించారు. కుటుంబ వ్యక్తిగత వివరాలను ఎన్యూమరేటర్లు సేకరిస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి కుటుంబంలోని సభ్యులందరి సమగ్ర వివరాలను నమోదు చేస్తున్నారు. కాబట్టి ప్రజలంతా సహకరించాలి. కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారం నమొద్దు’ అని కోరారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10