AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంచల్‌గూడ జైలు నుంచి భాను కిరణ్ విడుదల

మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ విడుదలయ్యాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత భాను కిరణ్ చంచల్‌‌గూడా జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాడు. సూరి హత్య కేసులో 12 ఏళ్ల పాటు జైలులో ఉన్న భానుకు ఇటీవల న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో కాసేపటి క్రితమే ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యాడు.

కాగా.. మద్దెల చెరువు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్‌కు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. సీఐడీ ఆమ్స్ ఆక్ట్ కేసులో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సూరి మర్డర్ కేసులో న్యాయస్థానం జీవిత ఖైదు విధించగా.. 12 సంవత్సరాలుగా భానుకిరణ్ చంచల్ గూడ జైలులోనే ఉంటున్నారు. గత 12 ఏళ్లుగా జైలులోనే ఉన్నానని తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా భాను కిరణ్ సుప్రీం కోర్టు, హైకోర్టును ఆశ్రయించాడు. అయితే బెయిల్‌పై స్థానిక కోర్టులో తేల్చుకోవాలని సుప్రీం న్యాయస్థానం తెలిపింది. ఈనెల 11న ఈ కేసు (జీవిత ఖైదు) కూడా విచారణకు రానుంది.

2011 సంవత్సరంలో జరిగిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2018 డిసెంబర్‌లో ఆయనకు నాంపల్లి కోర్టు శిక్ష ఖరారు చేసింది. 2011 జనవరి 4న మద్దెల చెరువు సూరిని హత్య చేశాడు. అప్పట్లో ఈ వార్త పెను సంచలనంగా మారింది. దివంగత నేత, టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్య కేసులో మద్దెల చెరువు సూరి నిందితుడు. జనవరి 4న హైదరాబాద్‌ సనత్‌నగర్‌ నవోదయ కాలనీలో సూరిని భాను కిరణ్ కాల్చిచంపాడు.

పరిటాల రవి హత్య కేసులో మద్దెల చెరువు సూరి ప్రధాన నిందితుడు. తన కుటుంబంలో ఉన్న అందరినీ హత్య చేశాడనే కోపంతో పరిటాల రవిని 2005లో సూరి కాల్చి చంపాడు. ఆపై పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఇక ప‌రిటాల ర‌విని హ‌త్య చేసిన కేసులో జైలు జీవితం గ‌డిపి బెయిల్ మీద‌ బ‌య‌ట‌కు వ‌చ్చిన సూరిని 2011 జనవరి 4న భాను కిర‌ణ్ కాల్చి చంపాడు. ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు 2018లో భాను కిరణ్‌కు జీవిత ఖైదు విధించింది. దీంతో అప్పటి నుంచి భాను కిరణ్‌ చంచల్‌గూడ జైలులోనే ఉన్నాడు. అయితే తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా నాంపల్లి కోర్టులో భాను పిటిషన్‌ వేయగా.. విచారణ జరిపిన కోర్టు సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కేసులో భాను కిరణ్‌కు బెయిల్‌ను మంజూరు చేసింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10