AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీశైలంలో భక్తుల సందడి.. కృష్ణానదిలో పుణ్య స్నానాలు

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. కార్తీక మాసం తొలి సోమవారం పరమ శివుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన యాత్రికులు తరలివచ్చారు. తెల్లవారుజామున కృష్ణా నదిలో పుణ్య స్నానాలు చేసుకుని పసుపు కుంకుమలతో సారె సమర్పించి, కార్తీక దీప దానాలు చేశారు.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు. స్వామివారికి సామూహిక అభిషేకాలు, గర్భాలయాభిషేకాలను మాసాంతం తాత్కాలికంగా నిలిపి వేసినట్లు ఈవో చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు.

అదేవిధంగా అమ్మవారికి కుంకుమార్చనలు, చండీహోమం, రుద్రయాగం, నిత్యకల్యాణం భక్తులు పాల్గొన్నారు. కార్తీక మాసం ప్రత్యేకంగా ఓం నమ: శివాయ ప్రణవ పంచాక్షరీ మంత్రాన్ని కర్ణాటక ఆంధ్ర భజన బృందాలచే చతుస్సప్తాహ భజనలు నిరంతరం జరుగుతున్నాయి. ఆలయ ఉత్తర మాఢవీధితోపాటు గంగాధర మండపం వద్ద మహిళలు అధిక సంఖ్యలో కార్తీక దీపాలను వెలిగించారు.

ANN TOP 10