AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సొంతగూటికి మాజీ మంత్రి.. టీడీపీలో చేరిన బాబు మోహన్

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు నేతలు తమకు కలిసొచ్చే పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. కీలక నేతలు కూడా ఎమ్మెల్యేల బాటలోనే హస్తం గూటికి చేరుకున్నారు. ఇక ఏపీలో టీడీపీ అధికారంలోకి రావటంతో తెలంగాణలో ఆ పార్టీ వైపు కూడా కొందరు నేతలు మెుగ్గు చూపుతున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాను టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు.

తాజాగా మాజీమంత్రి, ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ టీడీపీ పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయన ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను బాబు మోహన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో బాబు మోహన్ మంత్రిగా పని చేయగా.. తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. తెలంగాణ లో టీడీపీని బలోపేతం చేసే దిశగా పసుపు పార్టీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అడ్‌హక్ కమిటీలను ఏర్పాటు చేసింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ క్రమంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్ ఆ పార్టీలో చేరినట్లు ప్రకటించారు.

ANN TOP 10