AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రూ.వెయ్యి కోసం స్నేహితుడి దారుణ హత్య.. ముక్కలుగా చేసి కాలువలో పడేశాడు

వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. కలిసి తిరిగేవారు.. పనులకు వెళ్లేవారు. అయితే ఓ 1000 రూపాయలు వారి మధ్య చిచ్చు పెట్టింది. రాత్రి పడుకోవటానికి ఇంటికి వచ్చిన స్నేహితుడు రూ. వెయ్యి దొంగిలించాడని మరో స్నేహితుడు కక్ష పెంచుకున్నాడు. డబ్బులు తీసుకోవటమే కాకుండా తీసులేదని అబద్ధం చెప్పాడని మనసులో పెట్టుకున్నాడు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో కిరాతకంగా చంపేశాడు. అనంతరం క్రూరంగా శరీరాన్ని మూడు భాగాలుగా చేసి ఊరవతల కాలువలో పడేశాడు. నాలుగేళ్ల క్రితం ఈ దారుణ ఘటన చోటు చేసుకోగా.. తాజాగా.. న్యాయస్థానం నిందితుడికి శిక్ష విధించింది. జీవిత ఖైదుతో పాటు రూ.15 వేల ఫైన్ విధించింది.

వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా జిల్లెడ్‌ చౌదరిగూడెం మండలం కాసులాబాద్‌కు చెందిన గంజేటి అంజయ్య(46), తట్టెపల్లి రాజు (35) మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి గ్రామంలో చిన్నా చితక పనులకు వెళ్తుండేవారు. కలిసి తిరిగేవారు. అయితే అంజయ్య భార్య పుట్టింటికి వెళ్లగా కొన్నాళ్ల పాటు అతడు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. దీంతో రాజు అప్పుడప్పుడు అంజయ్య ఇంట్లో నిద్రించేవాడు. ఈ క్రమంలో 2020 ఆగస్టు 12న అంజయ్య ఇంట్లో రూ.1,000 కనిపించకుండా పోయాయి. డబ్బులు కనిపించటం లేదని.. తీశావా..? అని అంజయ్య తన స్నేహితుడు రాజును అడిగాడు.

ANN TOP 10