పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. బీర్భూమ్ (Birbhum) జిల్లాలోని ఓ బొగ్గు గని (Coal Mine)లో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం ప్రకారం.. బీర్భూమ్లోని లోక్పూర్ ప్రాంతంలో ఉన్న గంగారామ్చక్ మైనింగ్ ప్రైవేట్ కొలీరీ (Gangaramchak Mining Private Limited colliery)లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడు ధాటికి ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. సమీపంలో పార్క్ చేసిన వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.