AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్కూల్ బస్సు కింద పడి నర్సరీ విద్యార్థి దుర్మరణం

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కిందపడి నర్సరీ విద్యార్థి మృతి చెందింది. నామాపూర్‌కి చెందిన భూమయ్య, వెంకటవ్వ కూతురు మనోజ్ఞ మహర్షి స్కూల్‌లో నర్సరీ చదువుతుంది. స్కూల్ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం వల్ల పాఠశాల బస్సు కింద పడి మరణించిదని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు. మనోజ్ఞ తలపై నుంచి బస్ టైర్ వెళ్లడంతో అక్కడిక్కడే చనిపోయింది. విద్యార్థి తల్లి ఒక వ్యవసాయ కూలీ, తండ్రి ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి వర్క్ చేస్తుంటారు. చిన్నారి చావుతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

ANN TOP 10