AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డీఎస్సీ ఫలితాలు విడుదల.. ఆన్‌లైన్‌లో జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌

తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మార్చి 1న 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఫరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.45 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫైనల్‌ కీని సెప్టెంబర్‌ 6న విద్యాశాఖ విడుదల చేసింది.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. టీచర్ల నియామకానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్నారు. కేవలం 55 రోజుల్లోనే ఢిఎస్సీ ఫలితాలు ఇచ్చామని చెప్పారు. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఉంటుందని పేర్కొన్నారు. అక్టోబర్‌ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తామని తెలిపారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేశామని వెల్లడించారు. త్వరలోనే గ్రూప్‌ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తామన్నారు. స్కూల్‌ ఫీజుల నియంత్రణపై త్వరలో కమిటీ వేస్తామని చెప్పారు.

https://schooledu.telangana.gov.in/ISMS/ లేదా  https://tgdsc.aptonline.in/tgdsc/ లో చేక్ చేసుకోండి..

ANN TOP 10