AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు.. రోడ్డెక్కిన 35 ఎలక్ట్రిక్ బస్సులు.. త్వరలోనే మరికొన్ని బస్సులు

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు TGSRTC తీపి కబురు చెప్పింది. 500 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురానున్నట్లు వెల్లడించింది. తొలివిడతలో భాగంగా.. అత్యాధునిక హంగులతో కూడిన 35 ఎలక్ట్రిక్ బస్సులను కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డాక్టర్ సంజయ్‌లతో కలిసి ప్రారంభించాహరు. తెలంగాణలో తొలిసారిగా కాలుష్యరహిత ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్టీసీ వెల్లడించింది.

ఇక బస్సుల్లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించే సదుపాయాలు ఉన్నాయి. 41 సీటింగ్ సామర్థ్యమున్న ఈ ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌కు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీట‌ర్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. 2-3 గంట‌ల్లో వంద శాతం పూర్తి ఛార్జింగ్ పూర్తి కావటమే కాకుండా క్యాబిన్, సెలూన్‌లో రెండు చోట్ల సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ వెల్లడించారు. ఈ కొత్త బస్సులు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 500 ఎలక్ట్రిక్ బస్‌లను ప్రారంభిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ మేరకు జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుందన్నారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ ఎలక్ట్రిక్ బస్‌లను నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డీజిల్ బస్ కూడా ఉండకుండా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో అన్ని ఎలక్ట్రిక్ బస్‌లే నడిపేలా చూస్తామని అన్నారు. విప్లవాత్మక మార్పులు చేస్తూ ఆర్టీసీని మెరుగు పరుస్తున్నామని మంత్రి తెలిపారు.

ANN TOP 10