(అమ్మన్యూస్, తిరుమల):
తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం సాయంత్రం వేంకటేశ్వరుని సన్నిధికి చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. గురువారం వేకువజామున తోమాల, అర్చన సేవల్లో పాల్గొని దేవదేవుడిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మంటపంలో ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
రద్దీ సాధారణం..
కాగా, తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నది. టికెట్లులేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది. 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం 77,939 మంది భక్తులు ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. 22,668 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.50 కోట్లు వచ్చింది.