AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం.. సీఎం రేవంత్‌కు చెక్కులు అందజేసిన చిరంజీవి

– తన కుమారుడు రామ్‌ చరణ్‌ తరఫున మరో రూ.50 లక్షలు..

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు. టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి సైతం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందజేశారు. తన తరఫున రూ.50 లక్షలు, తన కుమారుడు రామ్‌ చరణ్‌ తరఫున మరో రూ.50 లక్షలు అందజేశారు. అందుకు సంబంధించిన రెండు చెక్కులను సోమవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌ రెడ్డికి చిరంజీవి అందజేశారు.

ప్రముఖ నటులు సైతం..
అదేవిధంగా ప్రముఖ నటులు విశ్వక్‌సేన్‌ రూ.10 లక్షలు, సాయిధరమ్‌ తేజ్‌ రూ.10 లక్షలు, అలీ రూ.3లక్షలు విరాళంగా అందజేశారు. జూబ్లీహిల్స్‌ నివాసంలో సీఎంని కలిసి చెక్కులు అందజేశారు. అమర్‌ రాజా గ్రూప్‌ తరఫున సీఎం సహాయ నిధికి రూ. కోటి విరాళంగా అందజేశారు. అందుకు సంబంధించిన చెక్కును మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి సీఎంకు అందజేశారు. గరుడపల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ రూ.25 లక్షలు విరాళంగా అందజేసింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10