AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గుడ్ న్యూస్.. మంగళవారం అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు..

గణేష్ నిమజ్జనం శోభాయాత్రలకు హైదరాబాద్ నగరం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఎల్లుండి మంగళవారం రోజు జరిగే వినాయక నిమజ్జనం, శోభాయాత్ర వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ఏర్పాట్లు చేస్తోంది. గణేశ్‌ నిమజ్జనం దృష్ట్యా హైదరాబాద్ మెట్రో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సంస్థ ఆదివారం వెల్లడించింది.

హైదరాబాద్ నగరంలోని చివరి స్టేషన్‌ ల నుంచి రాత్రి ఒంటిగంటకు చివరి రైలు బయలుదేరుతుందని వెల్లడించింది.. నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి అదనపు రైళ్లు నడుపుతామని పేర్కొంది. కాగా.. ఖైరతాబాద్‌ గణపతి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో మెట్రో స్టేషన్‌లు కిటకిటలాడుతున్నాయి. నిన్న ఒక్క రోజే ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ను 94వేల మంది ప్రయాణికులు వినియోగించుకున్నట్లు హైదరాబాద్ మెట్రో సంస్థ వెల్లడించింది.

ఖైరతాబాద్‌ మహాగణపతికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. ఆదివారం కావడం, నిమజ్జనం దగ్గర పడటంతో… బడా గణేషుని దర్శించుకునేందుకు సిటీతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఇవాళ అర్ధరాత్రి వరకు దర్శనాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇవాళ కూడా మెట్రో స్టేషన్లు రద్దీగా కనిపిస్తున్నాయి.

 

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10