ఈ తరం అద్భుత ఆవిష్కరణకు ‘ఏఐ’..
(అమ్మన్యూస్, హైదరాబాద్):
హైదరాబాద్ను ఏఐ ప్రపంచ రాజధానిగా మార్చడమే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్రెడ్డి. గురువారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా రెండురోజులపాటు ఏఐ గ్లోబల్ సమిత్-2024 ప్రారంభమైంది. ఈ సదస్సును సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే కావడంతో శుభాకాంక్షలు చెబుతూ తన స్పీచ్ ను సాగించారు. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికీ ఏఐ అనే థీమ్తో రెండు రోజుల పాటు సదస్సు కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి ప్రపం వ్యాప్తంగా 2వేల మంది పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్రెడ్డి 25 ఏఐ మార్గదర్శకాలతో రోడ్ మ్యాప్ విడుదల చేశారు.
24 సంస్థలతో..
ఇప్పటికే ప్రభుత్వం 24 సంస్థలతో ఎంవోయూను కుదుర్చుకుని ఏఐ సలహా మండలిని ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ సిటీ ఐటీ రంగంలో దేశంలో అగ్రగామిగా నిలిచిందిని అన్నారు. ఏఐ అనేది నేటి తరం అద్భుత ఆవిష్కరణ అని కొనియాడారు. ప్రపంచం అంతా నేడు ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో దూసుకెళ్తందని పేర్కొన్నారు. ఓ వైపు కొత్త టెక్నాలజీ ఆశ, భయం అనే రెండింటిని తీసుకొస్తుందని అన్నారు. కానీ, సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే ప్రపంచం ఎన్నటికి మారదని తెలిపారు. ఎవరో ఒకరి ఇన్నోవేషన్ ప్రపంచంతో పాటు ప్రజల జీవితాల్లో మర్పులు తెస్తుందని అన్నారు.
ఇటీవల కొత్త అవిష్కరణలతో ఉద్యోగాలు పోతాయనే బెంగ పట్టుకుందని తెలిపారు. కానీ, విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా ఏ నగరం సంసిద్ధంగా లేదని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశామని అన్నారు. అనంతరం హెచ్ఐ్ససీ (ఏఐఈఈ) లో సీఎం రేవంత్రెడ్డితో జేపీల్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఐబీఎం ప్రెసిడెంట్ డానియల్ కాంబ్, యోటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్ సీఈవోలు భీటీ అయ్యారు. ఈ మేరకు ఏఐ అభివృద్ధితో పాటు భవిష్యత్తు ఆవిష్కరణలపై సమావేశంలో చర్చించారు. అదేవిధంగా హైదారాబాద్ నగరంలో జీపీయూ అధారిత ఏఐ క్లౌడ్ ఏర్పాటులో భాగస్వామ్యంపై చర్చ జరిగింది.