AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్ల జీతం భారీగా పెంపు!

మారుమాల గిరిజన ప్రాంతాల్లో పని చేసే డాక్టర్లకు గుడ్‌న్యూస్. త్వరలోనే వీరి జీతాలు పెరగనున్నాయి. ఈ మేరకు రేవంత్ ప్రుభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణా ప్రాంతాలు, ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లకు జీతాలను రెట్టింపు చేయాలని తెలంగామ ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఏరియాల్లో విధులు నిర్వహించేందుకు డాక్టర్లు వెనకడుగు వేస్తుండటంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూరల్, ట్రైబల్ కేటగిరీలుగా విడగొట్టి ఆయా ప్రాంతాల్లో పని చేసే అన్ని విభాగాల డాక్టర్లకు జీతాలు, ఇన్సెంటివ్స్, ఇతర ప్రోత్సహకాలు అందించాలని నిర్ణయం తీసుకున్నది.

ఈ విధానం ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో అమలవుతుండగా.. అక్కడ సత్ఫలితాలను ఇవ్వటంతో అదే తరహాలో తెలంగాణలోనూ అమలు చేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ఒడిశాలో అమలు అవుతున్న ఇన్సెంటివ్ స్కీమ్‌పై తెలంగాణ వైద్యాధికారులు స్టడీ చేశారు. ఒడిశా రాష్ట్ర రాజధాని నుంచి ప్రతి 50 కి.మీ దూరానికి ఒక స్లాబ్ నిర్ణయించారు. బేసిక్‌ పేపై 25 శాతం నుంచి 150 శాతం వరకూ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో పర్యటించిన డీఎంఈ డాక్టర్ వాణి, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్‌ల నేతృత్వంలోని బృందం అక్కడ విధానాన్ని అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది.

ANN TOP 10