AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాఖీ కట్టేందుకు బయలుదేరిన గర్భిణీ.. బస్సులోనే ప్రసవం

గద్వాల్ డిపోకు చెందిన గద్వాల్ – వనపర్తి రూట్‌లో పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం నిండు గర్బిణీ సంధ్య.. రక్ష బంధన్ సందర్భంగా సోదరులతో రాఖీ కట్టించుకునేందుకు వనపర్తికి బయలుదేరింది. బస్సు నాచుపల్లి సమీపంలోకి రాగానే ఆమెకు నొప్పులు తీవ్రమయ్యాయి. బస్సు కండక్టర్ జి. భారతీ వెంటనే స్పందించారు. బస్సును పక్కకు ఆపి.. మిగిలిన ప్రయాణికులకు దింపేశారు అదే బస్సులో ప్రయాణిస్తున్న నర్సు సహాయంతో సంధ్యకు పురుడు పోశారు. అనంతరం 108 సాయంతో ఆ తల్లిబిడ్డలను వనపర్తిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

రక్షా బంధన్ రోజు.. ఓ మహిళా కండెక్టర్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. బస్సులోని నిండు గర్బిణికి నొప్పులు వచ్చాయి. దీంతో బస్సు కండెక్టర్ సమయస్పూర్తితో వ్యవహరించి.. ఆ నిండు గర్బిణీకి పురుడు పోశారు. దీంతో తల్లీ బిడ్డల ప్రాణాలను ఆమె కాపాడారు. సోమవారం ఉదయం గద్వాల్ డిపోకు చెందిన గద్వాల్ – వనపర్తి రూట్‌లో పల్లె వెలుగు బస్సులో నిండు గర్బిణీ సంధ్య.. రక్ష బంధన్ సందర్భంగా సోదరులతో రాఖీ కట్టించుకునేందుకు వనపర్తికి బయలుదేరింది.

ఈ సందర్భంగా ఆ బిడ్డను కండక్టర్ ఎత్తుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వి.సి. సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాఖీ పండుగ నాడు  బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్‌ మానవత్వం చాటుకున్నారని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. “ఓ మహిళ కండక్టర్ తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు” అని ఆ పోస్ట్‌లో ఆయన పేర్కొన్నారు.

టీజీఎస్ఆర్టీసీ బస్సులో గర్బిణికి పురుడు పోసిన వనపర్తి డిపోకు చెందిన కండక్టర్ భారతిని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. సమయ స్ఫూర్తితో వ్యవహరించి తల్లిబిడ్డల ప్రాణాలను కాపాడిన కండక్టర్‌ను ఈ సందర్భంగా పొగడ్తలతో ముంచెత్తారు.

 

ANN TOP 10