పావుగంటకుపైగా చర్చలు
(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డితో కాంగ్రెస్ సీనియర్ నేత, న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి భేటీ అయ్యారు. ఇరువురు మధ్య దాదాపు పావుగంట సేపు మాట్లాడినట్టు తెలుస్తోంది. వివిధ అంశాలపై చర్చించినట్టు సమాచారం. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్విని కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.