తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తిరువళ్లూరు సమీపంలో లారీని కారు ఢీ కొన్న ఘటనలో ఏపీలోని ఒంగోలుకు చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను నితీశ్ వర్మ, చేతన్ రామ్, యుకేష్, నితీశ్, చైతన్య విష్ణుగా గుర్తించారు.
ఈ విద్యార్థులంతా ఒంగోలులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. శనివారం ఒంగోలు నుంచి తిరువళ్లూరు వెళ్లిన విద్యార్థులు.. ఆదివారం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఓ వాగు ప్రవాహంలో కొట్టుకుపోవడంతో అందులోని ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. హిమాచల్ప్రదేశ్లోని మెహత్పూర్ సమీపంలోని డెహ్రా నుంచి పంజాబ్లోని ఎస్బీఎస్ నగర్లోని మెహ్రోవాల్ గ్రామంలో జరిగే వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.