AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏటా 6లక్షల ఎకరాలకు సాగునీరు.. మంత్రి ఉత్తమ్‌ వెల్లడి

సీతారామ.. ట్రయల్‌ రన్‌
ప్రారంభించిన మంత్రులు
15న పంప్‌హౌస్‌ను సీఎం ప్రారంభిస్తారని వెల్లడి
(అమ్మన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం):
భద్రాద్రి సీతారామ ప్రాజెక్టు 2, 3 లిఫ్ట్‌ ఇరిగేషన్లను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆగస్టు 15న ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పంప్‌ హౌస్‌ –2ను ఆదివారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పరిశీలించారు. అనంతరం పంప్‌ హౌస్‌ ట్రయల్‌ రన్‌ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడారు. పంద్రాగస్టు 15న రూ. 2 లక్షల రుణమాఫీని ప్రకటిస్తామని తెలిపారు. ఏటా 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. 2026 ఆగస్టు 15 నాటికి ఆయకట్టులోని ప్రతి ఎకరానికి నీరిస్తామని ఆయన చెప్పారు.

బీఆర్‌ఎస్‌ పాలనలో రూ.8వేల కోట్లు వృథా..
రీడిజైన్‌ పేరుతో బీఆర్‌ఎస్‌ పాలనలో రూ. 8 వేల కోట్లు వృథా చేశారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు నత్తనడక సాగాయన్నారు. పంప్‌ హౌస్‌ ల పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు త్వరగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సత్తుపల్లి ట్రంక్‌ పనుల్లో యాతాలకుంట టన్నెల పూర్తి చేయాలని వారు చెప్పారు. జూలూరుపాడు టన్నెల్‌ పూర్తయితే పాలేరు వరకు గోదావరి జలాలు వస్తాయంటూ మంత్రి వివరించారు.

ANN TOP 10