AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో 9 కేసులు నమోదు!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం కొన్ని రోజులుగా మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కింది. దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో కలిసి ఉంటున్నాడంటూ ఆయన భార్య వాణి, కుమార్తె హైందవి మీడియాకెక్కడం తెలిసిందే.

తాజాగా దువ్వాడ కుటుంబ వ్యవహారానికి సంబంధించి టెక్కలి పోలీస్ స్టేష్ లో 9 కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, భార్య వాణి, కుమార్తె హైందవిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దువ్వాడ శ్రీనివాస్…. తన భార్య వాణి, కుమార్తె హైందవిపై ఫిర్యాదు చేయగా…. వారు కూడా దువ్వాడపై ఫిర్యాదు చేశారు. ఇప్పటికే టెక్కలిలోని దువ్వాడ నివాసం వద్ద పోలీసులు మోహరించారు.

కాగా, గత అర్ధరాత్రి దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. గత రెండ్రోజులుగా భార్య వాణిని, కుమార్తె హైందవిని ఇంట్లోకి వచ్చేందుకు ఎమ్మెల్సీ దువ్వాడ అనుమతించడంలేదు. గంట తర్వాత వారు మళ్లీ అక్కడికి రాగా, ఓ గేటు తెరిచి ఉంచడంతో వారిద్దరూ ఇంట్లోకి ప్రవేశించారు. అయితే, ఎమ్మెల్సీ దువ్వాడ తీవ్ర ఆగ్రహంతో వారిపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు ఆయనను అడ్డుకుని లోపలికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా దువ్వాడ సోదరుడికి… వాణి, హైందవిలకు మధ్య వాగ్వాదం జరిగింది. దువ్వాడకు, భార్య వాణికి గత ఏడాది కాలంగా వివాదం నడుస్తోంది. రహదారి పక్కనే కొత్త ఇల్లు నిర్మించుకున్న దువ్వాడ… అందులో మరో మహిళతో కలిసి ఉంటున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10